వ్యాపారవేత్తతో నటి పూర్ణ పెళ్లి
ఢీ షోతో పాపులర్ అయిన నటి పూర్ణ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ఇప్పటికే తన ఎంగేజ్ మెంట్ పూర్తయిందని తన ఫ్యాన్స్ అందరికీ శుభవార్తను షేర్ చేసింది. త్వరలోనే దుబాయ్ వ్యాపారవేత్త షనీద్ ఆసీఫ్ అలీని వివాహం చేసుకోబోతున్నట్లు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్ తోపాటు పలువురు నటీనటులు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు.
షనీద్ ఆసీఫ్ అలీని కొంత మంది స్నేహితుల ద్వారా కలుసుకున్నట్లు నటి పూర్ణ తెలిపారు. అలాగే తన పెళ్లి తేదీని కూడా ప్రకటిస్తానని వెల్లడించారు. అవును, అఖండ, తలైవి, దృశ్యం 2 చిత్రాల్లో మంచి నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు పూర్ణ. ఐతే మళయాల చిత్ర సీమతో మొదలు పెట్టిన నటి పూర్ణ.. తన ప్రయాణాన్ని అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ కొనసాగిస్తోంది. మళయాలంలో మంజు పోలోరు పెన్ కుట్టితో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 3 రోజెస్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ఇక తెలుగునాట టీవీ ఇండస్ట్రీలోనూ పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ధమాకా, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలలో అలరించింది. ఇప్పటి వరకు నటి పూర్ణ తెలుగు, మళయాలంలో కలిపి 50కి పైగా సినిమాలు చేయడం విశేషం.
Tags:
Cinema