(Video) కార్తికేయ 2 విజయంపై చిత్ర యూనిట్ విశేషాలు
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విజయంపై పలు విశేషాలను సినిమా యూనిట్ పంచుకుంది. ఇందులో హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు చందు మొండేటి పాల్గొన్నారు.
నిజానికి కార్తికేయ 2 సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంది. కానీ ఆగస్టు 13న థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రభంజనం సృష్టిస్తోంది. తెలుగుతోపాటు హిందీలోనూ అదరగొడుతోంది. ముఖ్యంగా హిందీలో కేవలం 50 షోలతో మొదలైన కార్తికేయ 2 ప్రస్థానం 3వేలకు పైగా షోలు వేసే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో హౌజ్ ఫుల్ షోలతో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. నిన్న, మొన్నటి వరకు థియేటర్లకు రావడం లేదనే వాదనలు ఈ సినిమాతో ఒక్కసారిగా తలకిందులయ్యాయని చెప్పవచ్చు. పాజిటివ్ టాక్, వరుస సెలవులు కార్తికేయ 2 సినిమాకు కలిసి వచ్చాయనే చెప్పవచ్చు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి రావడం సినిమాకు మరింత కలిసి రానుంది. ఈ క్రమంలో చిత్ర విశేషాలను దర్శకుడు, హీరో, హీరోయిన్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం...