బండి సంజయ్ పై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

        బండి సంజయ్ పై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కూడా ఈడీ(ED) విచారణ ఎదుర్కోక తప్పదంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు తాజాగా మంత్రి కేటీఆర్(KTR) కూడా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. సెటైరికల్ ట్వీట్ చేశారు. 

 ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అడ్రస్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని ఈడీ చీఫ్ గా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.  అంతే కాదు ఇండియాను పరుగులు పెట్టిస్తున్న డబుల్ ఇంజిన్ మోడీ మరియు ఈడీ అని మాకు ఇప్పుడు అర్ధమైందని ట్వీట్ లో రాసుకొచ్చారు.  అంతే కాదు బండి  సంజయ్.. సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా కథనాన్ని ట్వీట్ కు జత చేశారు కేటీఆర్.

 అంతకు ముందు గురువారం నాడు జనం గోస.. బీజేపీ భరోసా కార్యక్రమం జరిగింది. ఆ ర్యాలీ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ విచారణ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలకు కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతే కాదు కేసీఆర్ కూడా త్వరలో ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బహుశా అందుకే ఆయన కాంగ్రెస్ తో కలవక తప్పడం లేదేమో అన్నారు. ఐతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.  


Post a Comment

Previous Post Next Post