డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి.. జర జాగ్రత్త

        డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి.. జర జాగ్రత్త 


వదలకుండా కురుస్తున్న వర్షాలు

ఎక్కడికక్కడ నిలిచిన నీరు

అపరిశుభ్రత కారణంగా పెరుగుతున్న దోమలు

దోమకాటుతో తెలంగాణలో పెరుగుతున్న డెంగీ జ్వరాలు

 తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఫలితంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి అపరిశుభ్రత ఏర్పడిన కారణంగా దోమలు పెరుగుతున్నాయి. దోమల స్వైరవిహారంతో డెంగీ జ్వరాలు(Dengue fever) కూడా విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడడం, నీరు నిలిచే పరిస్థితి ఉండడం వల్ల డెంగీ జ్వరాలు మరింత విజృంభించే అవకాశం ఉందని వెల్లడించింది. వీలైనంత వరకు ఇంటి చుట్టు పరిసర  ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

తెలంగాణలో పెరుగుతున్న డెంగీ కేసులు 

తెలంగాణలో ఇప్పటికే ఏడు జిల్లాల్లో డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా.. సుమారు 1200 డెంగీ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 100 మందికి పైగా డెంగ్యూ బారినపడ్డారు. అలాగే జూన్‌లో అత్యధికంగా 565 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక జులైలో ఇప్పటికే 222 మందికి డెంగీ జ్వరం సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాబోయే మరింత అప్రమత్తత అవసరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే.. హైదరాబాద్ లో అత్యధికంగా  516 మంది డెంగీ బారినపడ్డారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 97, కరీంనగర్‌లో 82, ఆదిలాబాద్‌లో 57, మేడ్చల్‌ జిల్లాలో 55, మహబూబ్ నగర్‌లో 54, పెద్దపల్లి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి.

డెంగీ జ్వరం లక్షణాలు

డెంగీ జ్వరం వచ్చిన వారిలో ప్రధానంగా తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, తల తిరగడం, కండరాల నొప్పులు, ఒంటిపై దద్దుర్లతోపాటు విపరీతమైన నీరసం లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. డెంగీ కోసం అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డెంగీ పగటిపూట కుట్టే దోమలతోనే వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకునే వృద్ధులు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

డెంగీ సోకినవారికి ప్లేట్‌లెట్ ల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఆస్పత్రిలో ప్లేట్ లెట్ చికిత్స అందిస్తుంటారు. ఐతే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న చికిత్స. కాబట్టి అవసరమైన వారికి మాత్రమే ప్లేట్ లెట్ చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.  

Read Also: సునామీ మళ్లీ వస్తుందా?

Follow us on:   



Post a Comment

Previous Post Next Post