బియ్యపు గింజలతో జనసేనాని పవన్ కళ్యాణ్ చిత్రం

        బియ్యపు గింజలతో పవన్ కళ్యాణ్ చిత్రం


  కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో పర్యటించనున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధికసాయం అందించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లల్ని చదివించే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఇప్పటికే జనసేన ప్రకటించింది. 

 కౌలు రైతులు, వారి కుటుంబాల కోసం ఆర్ధికంగా చేయూత అందిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఈ రోజు ఒక విద్యార్థిని అరుదైన బహుమతి అందించనుంది. గీత అనే విద్యార్థిని పవన్ కల్యాణ్ కు బియ్యపు గింజలతో తీర్చిదిద్దిన ఆయన కళాఖండాన్ని బహుకరించనుంది. అన్నదాతల కన్నీళ్లు తుడవడానికి ఓ వైపు పవన్ కల్యాణ్ సాయం చేస్తుంటే.. అదే రైతులు పండించిన బియ్యంతో పవన్ రూపాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా ఉంది. గీత వేసిన బియ్యం గింజలతో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. 


Read Also: డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి.. జర జాగ్రత్త

Read Also: ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి?

Follow us on:  



Post a Comment

Previous Post Next Post