భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
అందరూ ఊహించిందే జరిగింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(Droupadi murmu) ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారీటీతో ఆమె ఘన విజయం సాధించారు. దీంతో భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి(President of India)గా ఆమె గుర్తింపు పొందారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై గెలుపొంది.. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి ఆమె ఆధిపత్యం కొనసాగింది. ముఖ్యంగా ఎంపీల ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము ఘనమైన మెజారిటీ సొంత చేసుకున్నారు. మొత్తంగా 763 మంది ఎంపీలు ఓటు వేయగా.. వాటిలో 15 ఓట్లు చెల్లలేదు. ఐతే ఎంపీ ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ము 540 ఓట్లు సాధించారు. వాటి విలువ 3 లక్షల 78 వేలు. ఇక తర్వాత నిర్వహించిన ఎమ్మెల్యేల ఓట్ల కౌంటింగ్ లోనూ ద్రౌపది ముర్ము ఆధిపత్యమే కనిపించింది.