భక్తుల నడక మార్గంలో గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసిన TTD
![]() |
Image Credit: Twitter |
కలియుగ వైకంఠం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఐతే వేసవి ఎండలు విపరీతంగా ఉండడంతో నడక మార్గంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం సరికొత్త ఏర్పాటు చేసింది.
అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వచ్చే భక్తులకు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులకు 24 గంటల్లోనే పరిష్కార మార్గం చూసింది టీటీడీ.భక్తులు కాళ్ళు కాలకుండా ఉండడానికి యుద్ధప్రాతిపదికన గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేయించారు. నడక దారిలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడివరకు భక్తులు ఈ గ్రీన్ మ్యాట్ వేయించారు. అంతే కాదు దానిపై ఎప్పటికప్పుడు నీరు చల్లించే ఏర్పాటు కూడా చేసింది టీటీడి. ఇందుకోసం ప్రత్యే సిబ్బందిని కేటాయించింది.
సామాన్య భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వేసవిలో భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.