Is amma vodi scheme cancelled in AndhraPradesh అమ్మ ఒడి పథకం రద్దవుతోందా..AP సర్కారు క్లారిటీ

        అమ్మ ఒడి పథకం రద్దవుతోందా..AP సర్కారు క్లారిటీ

Image Credit: Twitter

 ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులందరూ చదువుకునేందుకు జగన్ సర్కారు ఏర్పాటు చేసిన పథకం అమ్మఒడి. ఈ స్కీం కింద రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువు కోసం ఏటా వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 15వేలు జమ చేస్తోంది. ఇప్పటికే రెండేళ్లపాటు ఇలా నిధులను అందించింది సర్కారు. ఐతే తాజాగా ఈ పథకంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేస్తోందనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం రంగంలోకి దిగింది. పథకంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేసింది. ఇలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి ఖాతాలను గుర్తించినట్లు తెలిపింది. వారిపై సైబర్ లా ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించింది. అమ్మ ఒడి పథకం మాత్రమే కాదు.. వాహన మిత్ర పథకంపైనా పలువురు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించింది. 

అమ్మ ఒడి పథకం నిబంధనల మార్పు 

 మరోవైపు రాష్ట్ర సర్కారు అమ్మ ఒడి నిబంధనల్లో పలు మార్పులు చేసింది. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగించే వారికి అమ్మ ఒడి పథకం వర్తించదు. రాష్ట్ర సర్కారు జారీ చేసిన బియ్యం కార్డు లేకపోయినా, కొత్త జిల్లాల ప్రకారం ఆధార్ కార్డులో మార్పులు లేకపోయినా పథకం వర్తించదని స్పష్టం చేసింది. అంతే కాదు విద్యార్థులకు పాఠశాలల్లో 75 శాతం హాజరును తప్పనిసరి చేసింది. 

Read Also: RRR సినిమాలో బ్రిడ్జీ సీన్.. గ్రాఫిక్స్ లో ఇలా చేశారా(వీడియో)


Post a Comment

Previous Post Next Post