అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఏపీ కేబినెట్ ఆమోదం
![]() |
Image Credit: Twitter |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన భేటీలో కేబినెట్ అజెండాలోని దాదాపు 42 కీలక విషయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఈ నెల 27న అమలు చేయనున్న అమ్మఒడి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 43 లక్షల 96వేల 402 మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు జమ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ. 216 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే సంక్షేమ కేలండర్కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇకపై ఆక్వాసాగు సబ్సిడీ 10 ఎకరాలు ఉన్నవారికి సైతం వర్తింప చేయాలని మంత్రి వర్గం తీర్మానించింది. అటు పాత జిల్లాల జడ్పీ ఛైర్మన్ల కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Also: అమర్నాథ్ యాత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?