(వీడియో)HYDలో మోదీ ఫ్లెక్సీ కలకలం

            HYDలో మోదీ ఫ్లెక్సీ కలకలం


 హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. జులై 2 నుంచి హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో జులై 3న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రానున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఐతే ప్రధాని మోదీ రాక సందర్భంగా సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. మోదీకి వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 

 టీవోలీ సినిమా థియేటర్ ఎదురుగా కూడలిలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, నోట్ల రద్దు, నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ఫ్లెక్సీలో ముద్రించారు. సాలు మోదీ సంపకు మోదీ.. అంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. అంతే కాదు ఫ్లెక్సీ చివరి భాగంలో #BYEBYEMODI అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా రాశారు.

 ఈ ఫ్లెక్సీతో పాటు మరికొన్నింటిని కూడా పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఐతే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు కంటోన్మెంట్ సిబ్బంది ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. 

 మరోవైపు ఇప్పటికే తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద 'సాలు దొర.. సెలవు దొర' అంటూ ఆ పార్టీ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు కౌంట్ డౌన్ షురూ అయిందంటూ ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఐతే దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇరు పార్టీల మధ్య మరింత రగడకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.


Post a Comment

Previous Post Next Post