దూసుకొస్తున్న సౌరతుపాను.. జీపీఎస్ సిగ్నళ్లకు అంతరాయం

దూసుకొస్తున్న సౌరతుపాను.. జీపీఎస్ సిగ్నళ్లకు అంతరాయం


 సౌర తుపాను ఒకటి వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. అది మంగళవారం(జులై 19న) భూమిని తాకే అవకాశం ఉందని అమెరికా స్పేస్ సంస్థ నాసా(NASA) వెల్లడించింది.  ఈ సౌర తుఫాన్ కారణంగా భూమిపై ఉండే జీపీఎస్(GPS) రేడియో సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడుతుందని ప్రకటించింది. 

సూర్యుని నుంచి విడుదలయ్యే పాము ఆకారం లాంటి ఫిలమెంట్ నేరుగా భూమిని ఢీకొట్టనుందని స్పేస్ వెదర్ ఉమన్ డా. తమిథా స్కోవ్ వెల్లడించారు. నాసా ప్రకటించిన సమాచారం ఆధారంగా సౌర తుఫాను గురించి ఆమె ట్వీట్ చేశారు. భూ ఉపరితలంపై ఈ తుపాను ప్రభావం విపరీతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సౌర తుఫాను కారణంగా భూ ఉపరితలంపై GPS నావిగేషన్ సిస్టమ్‌ల బ్లాక్‌అవుట్‌లకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది రేడియో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే వాతావరణంలోని పై పొరలను అయనీకరణం చేస్తుంది. 

జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం కలిగించడంతోపాటు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ధృవ కాంతి(అరోరా) కనిపించే అవకాశం ఉందని డా. తమిథా స్కోవ్ వెల్లడించారు. అంతే కాకుండా ఈ సౌర తుపాను తర్వాత మరికొన్ని చిన్న సౌర తుఫాన్లు కూడా రాబోయే రోజుల్లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. ఈ నెల 20, 21న ఇవి భూమిని చేరే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇవి G-1 తరగతి తుపానులుగా తెలిపింది. జియోమాగ్నెటిక్ తుఫానులను 'G స్కేల్'లో కొలుస్తారు. G1-తరగతి తుఫానులు చాలా చిన్నవిగా ఉంటాయి. సౌర తుఫాను అయస్కాంత విన్యాసాన్ని బట్టి G2 లేదా బహుశా G3-స్థాయి పరిస్థితులు కూడా సంభవించవచ్చు. 

Read Also: ప్రాణాయామంతో బీపీ దూరమవుతుందా?

సౌర తుపాను అనేది సూర్యనిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే ఆయస్కాంత విస్ఫోటనం. ఐతే ఈ అయస్కాంత తరంగాలు భూమి వైపు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. సౌర తపాను సమయంలో సూర్యుని నుంచి వెలువడే శక్తి భూమిపై ఉండే అన్ని విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే లక్ష రెట్లు అధికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో సౌర తుఫాను ప్రభావం ఎంత మేరకు ఉంటుందో ఊహించుకోవచ్చు.


Post a Comment

Previous Post Next Post