గౌరవెల్లి ప్రాజెక్టులో భూనిర్వాసితుల రక్తం పారిస్తున్నారు: బండి

గౌరవెల్లి ప్రాజెక్టులో భూనిర్వాసితుల రక్తం పారిస్తున్నారు: బండి


  గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై జరిగిన లాఠీ ఛార్జీ పంచాయితీ తెలంగాణ గవర్నర్ తమిళిసై వద్దకు చేరింది. ఈ ఘటను తీవ్రంగా ఖండించిన తెలంగాణ బీజేపీ...  సర్పంచ్ సమస్యలతోపాటు పలు సమస్యలపై గవర్నర్ తమిళిసైని కలిసి వినతి పత్రం అందించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేసీఆర్ సర్కారుతోపాటు ముఖ్యమంత్రిపైనా తీవ్ర విమర్శలు చేశారు. 

 గౌరవెల్లి భూనిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. న్యాయబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడి చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. గతంలో టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకే భూనిర్వాసితులు పునరావాస ప్యాకేజీ కోరుతున్నారని తెలిపారు. గౌరవెల్లి భూనిర్వాసితులపై పోలీసులు దాడి చేస్తే.. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉండి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఎన్జీటీ సహా ఎలాంటి అనుమతులు లేకున్నా గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ కు ప్రయత్నించడం దారుణమన్నారు సంజయ్. అంతే కాదు ప్రాజెక్టులు నీరు కాదు.. భూనిర్వాసితుల రక్తం పారిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 తెలంగాణలో రైతులు, ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ పాలనలో గోస పడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనసు రావడం లేదని విమర్శించారు. కానీ ఎక్కడో పంజాబ్ లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ధారపోశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు అంతా బాగుందని కోట్ల రూపాయల ప్రజా ధనంతో పత్రికల్లో ప్రకటనలు వేయించుకున్నారని సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని కోరారు. అంతే కాదు తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని విమర్శించారు. అలాగే గౌరవెల్లి భూనిర్వాసితులపై లాఠీఛార్జీకి పాల్పడిన సీఐ రఘుపతి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

Read Also:  వెన్ను నొప్పి బాధిస్తోందా? ఇలా చేయండి 



Post a Comment

Previous Post Next Post