శ్రీవారి కానుకల ఈ- వేలంలో పాల్గొనేదెలా?

                    శ్రీవారి కానుకల ఈ- వేలంలో పాల్గొనేదెలా?


 కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి కావడం, స్కూళ్లు కాలేజీలు తెరుచుకోవడంతో కొద్ది రోజుల్లో రద్దీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పెద్ద ఎత్తున శ్రీనివాసుడికి కానుకలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిల్వ ఉన్న కానుకలను వేలంలో విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయించింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ- వేలంలో పాల్గొని స్వామి వారి వస్తువులు కొనుగోలు చేసుకోవాలని సూచించింది. 

  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులు ధన, కనక, వస్త్ర రూపంలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఐతే ఇలా వచ్చిన కానుకలను తిరిగి భక్తులకు విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని స్వామి వారి కైంకర్యాలతోపాటు ధార్మిక కార్యక్రమాలకు టీటీడీ వినియోగిస్తుంది. ప్రస్తుతం స్వామి వారి శేష వస్త్రాలను ఈ- వేలంలో పెట్టనుంది టీటీడీ. దాదాపు 149 లాట్ల వస్త్రాలను జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు ఈ- వేలంలో విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ సహా టీటీడీ పోర్టల్ ను వినియోగించుకోనుంది.

ఈ- వేలంలో పాల్గొనాలనుకునే భక్తులు www.konugolu.ap.gov.in  లేదా  www.tirumala.org లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే 0877-2264429 ఫోన్ నంబరులో సంప్రదించినా టీటీడీ సిబ్బంది వివరాలుచెబుతారు. 

Read Also: మెదడు ఆరోగ్యానికి మెరుగైన ఆహారం



Post a Comment

Previous Post Next Post