భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమం ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం.
ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, సీజేఐ ఎన్వీ రమణ హాజరయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత తనను ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ప్రసంగించిన ఆమె.. భారత అత్యున్నత పదవి చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఈ పదవి గౌరవానికి భంగం కలగకుండా పని చేస్తానని తెలిపారు. కరోనా కాలంలో భారత్ తనను కాపాడుకోవడమే కాకుండా మిగిలిన దేశాలకు కూడా సాయం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో అన్ని దేశాలు భారత్ వైపు చూసే దృష్టి మారిందని చెప్పారు. అందరం కలిసి ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మిద్దామని ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
Watch LIVE: Swearing-in-Ceremony of President-elect #DroupadiMurmu as the 15th President of India.@rashtrapatibhvn https://t.co/qkOe8YUgPb
— DD News (@DDNewslive) July 25, 2022