LPG గ్యాస్ ధర మళ్లీ పెంపు
సామాన్యుడి ఇంట్లో చమురు సంస్థలు మళ్లీ మంట పెట్టాయి. ఎల్పీజీ(LPG) ధరలను మళ్లీ పెంచేశాయి. ముఖ్యంగా సామాన్యులు వాడే డొమెస్టిక్ సిలిండర్ పై మళ్లీ 50 రూపాయలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం ఉన్న రూ. 1055కు అదనంగా 50 రూపాయలు వసూలు చేయనున్నాయి చమురు కంపెనీలు. దీంతో గృహ వినియోగదారులు వాడే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ బండ ధర రూ. 1105కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1053 గా ఉంది. మరోవైపు 5 కేజీల సిలిండర్ నూ చమురు కంపెనీలు వదిలిపెట్టలేదు. వాటిపైనా రూ. 18 బాదేశాయి. ఐతే చిత్రంగా కమర్షియల్(వాణిజ్య) సిలిండర్ ధరపై మాత్రం చమురు సంస్థలు కనికరించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచకపోగా రూ. 8.50 పైసలు తగ్గించడం విశేషం.
మరోవైపు గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని కేంద్రంపై పదే పదే విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ తమ విమర్శలను మరోసారి ఎక్కుపెట్టింది. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెంచడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశంలో అచ్చేదిన్ వచ్చాయని.. అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అంతే కాదు దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
#AchheDin Aa Gaye 👏 Badhai Ho #LPG over ₹1050 👇 An increase again of ₹50
— KTR (@KTRTRS) July 6, 2022
Modi Ji’s Gift to all Indian Households👍 https://t.co/BknwJ2zNfi