డాక్టర్ గా మారిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
స్వతహాగా వైద్యురాలైన తెలంగాణ గవర్నర్ తమిళిసై... మరోసారి డాక్టర్ గా మారారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో ప్రయాణిస్తున్న ఆమె.. ఓ ప్రయాణీకునికి తన వైద్య సేవలు అందించారు. ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రథమ చికిత్స చేశారు. ప్రయాణికుడు ఛాతీలో నొప్పి, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడు విమానం గాల్లో ఉంది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో... విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అనౌన్స్ చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అవసరమైన మందులతో ఉపశమనం కలిగించారు. దీంతో కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు గవర్నర్ తమిళిసైని అభినందించారు.
Today Pondicherry Governor @DrTamilisaiGuv treated a patient who fell ill on Air on Delhi-Hyd bound flight in @IndiGo6E
— Chakaravarthy (@chak2006) July 23, 2022
Governor responded to panic call from air hostess while the flight was in mid air at 6.24am.Treated with FIRST AID & supportive drugs.
Kudos to Tamilisai Madam pic.twitter.com/rZPnH4Iyna
అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. MBBS, MD-DGO వైద్య విద్య కోర్సులు చేసిన సంగతి తెలిసిందే.