డాక్టర్ గా మారిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

డాక్టర్ గా మారిన తెలంగాణ గవర్నర్ తమిళిసై


 స్వతహాగా వైద్యురాలైన తెలంగాణ గవర్నర్ తమిళిసై... మరోసారి డాక్టర్ గా మారారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో ప్రయాణిస్తున్న ఆమె.. ఓ ప్రయాణీకునికి తన వైద్య సేవలు అందించారు. ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రథమ చికిత్స చేశారు. ప్రయాణికుడు ఛాతీలో నొప్పి, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడు విమానం గాల్లో ఉంది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో... విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అనౌన్స్ చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అవసరమైన మందులతో ఉపశమనం కలిగించారు. దీంతో కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు గవర్నర్ తమిళిసైని అభినందించారు.  

 అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. MBBS, MD-DGO వైద్య విద్య కోర్సులు చేసిన సంగతి తెలిసిందే.

Join us on Telegram Channel: 👉https://t.me/URnewstag

Post a Comment

Previous Post Next Post