కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు తిరుమలేషుని దర్శనం చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇందుకోసం ఉచిత ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల చేయనుంది. జులై 23న శనివారం నాడు ఆగస్టు నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 9 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు విడుదల కానున్నాయి. ప్రతి రోజూ వెయ్యి టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఈ టికెట్లు ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఆగస్టు నెలలో మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. tirupatibalaji.ap.gov.in సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
మరోవైపు తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు అంతా సిద్ధమవుతోంది. జులై 23న సాయంత్రం అంకురార్పణ జరగనుంది. జులై 24 నుంచి 26 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా నివారించేందుకు ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జులై 23 నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. రోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. భక్తులు రూ.500 చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.
Read Also: బ్రంచ్ అంటే ఏంటి ? ఆరోగ్యానికి ఏది మంచిది?
Join us With Telegram Link:👉 https://t.me/URnewstag