మద్యం మిథ్య.. నిషేధం మిథ్య.. పవన్ ట్వీట్
![]() |
Image: Twitter |
ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధంపై రాజకీయ పార్టీల మధ్య రగడ రాజుకుంది. మంత్రి అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో మధ్య నిషేధంపై భారీగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం నిషేధిస్తామని మా మేనిఫెస్టోలోనే పెట్టలేదని మంత్రి అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని మాత్రమే చెప్పామన్నారు. పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పలేదని తెలిపారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా వైసీపీ మేనిఫెస్టో ఉంటుందని.. కావాలంటే చూసుకోవచ్చన్నారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు వ్యంగ్యాన్ని జోడిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 'మద్యం మిథ్య.. నిషేధం మిథ్య.. తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం.. అంతా వాడిష్టం'' అనే వ్యాఖ్యలతో కూడిన కార్టూన్ ను ఆయన పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
— Pawan Kalyan (@PawanKalyan) August 1, 2022
అయితే వైసీపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే.. ‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం’ అని పొందుపరిచారని విపక్షాలు చెబుతున్నాయి.