Vijaya shanti meet sasikala in chennai శశికళతో విజయ శాంతి భేటీ

            శశికళతో విజయ శాంతి భేటీ

 


 కొంత కాలం నుంచి స్తబ్దుగా ఉన్న తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ హీట్ రగులుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. తమిళనాడు పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే (AIADMK ) పార్టీని తిరిగి హస్తగతం చేసుకునేందుకు ఆమె పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పార్టీలో, పార్టీలోని నేతల మధ్య ఉన్న అంతర్గత వైరుధ్యాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అంతే కాదు అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు తిరిగి చేపడతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కమిటీ కన్వీస్ పన్నీర్ సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి మధ్య ఉన్న అంతర్గత కలహాలు, గ్రూప్ తగాదాలను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు చిన్నమ్మ శశికళ. అంతే కాదు ఇద్దరి మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా వారిలో సఖ్యత వచ్చే అవకాశం కూడా లేదంటూ వ్యాఖ్యానించడం విశేషం.


 మరోవైపు సాధారణ ఎన్నికల నాటికి తమిళనాడు రాజకీయాల్లో పాగా వేసేందుకు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఇందుకోసం తెలంగాణ బీజేపీ నేత విజయ శాంతిని రంగంలోకి దింపింది. ఈ క్రమంలో చెన్నై వెళ్లిన విజయ శాంతి.. చిన్నమ్మ శశికళతో భేటీ అయ్యారు. తమిళనాడులోని తాజా రాజకీయ పరిస్థితులపై  చర్చించారు. దీంతో ఈ టాపిక్ తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా మారింది. వీరిద్దరి భేటీ తర్వాత తమిళనాడు రాజకీయాలు ఏ మార్పు తీసుకుంటాయోనని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. గతంలోనూ విజయశాంతి చెన్నై వేదికగా శశికళతో భేటీ అయ్యారు. ఐతే తాజాగా భేటీ కావడం పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది. 

ఇదీ చదవండి: విశాఖకు విదేశీ విహార నౌక


Post a Comment

Previous Post Next Post