Allu Aravind on OTT cinema ఓటీటీని దూరం పెట్టాలి

 ఓటీటీ (OTT)ని దూరం పెట్టాలి: అల్లు అరవింద్


 కరోనా లాక్ డౌన్ కాలంలో సగటు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కల్లోలం రేపుతోంది. ఓటీటీకి ఓకే అంటూనే ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేందుకు నిర్మాతలు, దర్శకులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు సగటు సినిమా ప్రేక్షకుడికి ఇంట్లోనే వినోదం పంచుతున్న ఓటీటీకి సినిమాలు ఇచ్చేందుకు నిర్మాతలు కాస్త వెనుకడుగు వేస్తున్నారు. ఐతే పూర్తిగా ఓటీటీని కాదనలేని పరిస్థితి. అందుకే థియేటర్లలో సినిమా రిలీజైన తర్వాత కాస్త ఆలస్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన F3 movie యూనిట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత, టాలీవుడ్ లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 


 కరోనా తర్వాత ఇండస్ట్రీ నేర్చుకున్న గుణపాఠాల్లో ఓటీటీ కూడా ఒకటంటూ స్పష్టం చేసిన అల్లు అరవింద్... మరో హింట్ కూడా ఇచ్చేశారు. తాజాగా ఆయన నిర్మించిన పక్కా కమర్షియల్ చిత్రాన్ని ఓటీటీలో కొన్ని వారాల తర్వాతే రిలీజ్ చేస్తామని చెప్పారు. పైగా సినిమా ఇండస్ట్రీ ఓటీటీని కాస్త దూరం పెట్టి.. టికెట్ రేట్లు తగ్గిస్తేనే థియేటర్లకు జనాలు వస్తారని తెలిపారు.

అల్లు అరవింద్ స్పీచ్ కోసం ఇక్కడ క్లిక్  చేయండి

 అలాగే సినిమా ప్రమోషన్ విషయంలోనూ హీరో, హీరోయిన్లు శ్రద్ధ చూపించాలన్నారు అల్లు అరవింద్. ఓటీటీ సహా ఇతరత్రా రూపంలో సినిమా కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఈ సమయంలో వారిని థియేటర్లకు రప్పించేందుకు కచ్చితంగా ప్రమోషన్లు అవసరమని స్పష్టం చేశారు. అంతే కాదు.. ఆ ప్రమోషన్ ను సినిమా హీరో, హీరోయిన్లే భుజాలకెత్తుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవలే ఓ పెద్ద హీరో తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఈవెంట్ లో డాన్స్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు అరవింద్. 

Read Also: F3 సినిమా OTTలో రిలీజయ్యేది అప్పుడే

Post a Comment

Previous Post Next Post