(వీడియో)అమెరికాలో మళ్లీ కాల్పులు, ఒకరు మృతి

                అమెరికాలో మళ్లీ కాల్పులు, ఒకరు మృతి 


 అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. వాషింగ్టన్‌లో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందగా.. నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వైట్‌ హౌస్‌కు రెండు మైళ్లదూరంలో  వాష్టింగన్‌ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌ నార్త్‌వెస్ట్‌లో జరుగుతున్న ఓ సంగీత కచేరి కార‍్యక్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. 

కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. అకస్మాత్తుగా జరిగిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. పోలీస్​ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్​ పోలీస్​ విభాగం తెలిపింది. 

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. గాయపడ్డ వారిని పలు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అంతకుముందు.. మే 24న టెక్సాస్‌లోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆనాడు జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే అమెరికాలో మారణాయుధాలను నిషేధించాల్సిన అవసరం ఉందని పలుమార్లు చెప్పుకొచ్చారు బైడెన్. లేనిపక్షంలో గన్ కల్చర్ పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్ఘాటించారు. అలాగే తుపాకీ కొనుగోలు వయసును 18 నుంచి 21కి పెంచడంతో పాటు నిబంధనలను కఠినతరం చేయాల్సి ఉంటుందని చెప్పారు.

Read Also: రాజమౌళికి ఆ సినిమాలంటే భయమా?

Post a Comment

Previous Post Next Post